19న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-10-18T21:50:47+05:30 IST

ఈనెల 19న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు యాదాద్రికి బయలు దేరి వెళ్లనున్నారు. ఉదయం 11.30గంటలు సీఎం హైదరాబాద్‌ నుంచి బయలు దేరి వెళతారు

19న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: ఈనెల 19న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు యాదాద్రికి బయలు దేరి వెళ్లనున్నారు. ఉదయం 11.30గంటలు సీఎం హైదరాబాద్‌ నుంచి బయలు దేరి వెళతారు.యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణపనులు పూర్తిస్ధాయిలో ముగిసిన నేపద్యంలో అన్నింటినీ మరోసారి సీఎం పరిశీలించనున్నారు.యాదాద్రి పునః ప్రారంభం తేదీ, ముహుర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌ స్వామి నిర్ణయించారు. యాదాద్రిలోనే ఆలయ పునః ప్రారంభం తేదీలను సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటిస్తారు. పునః ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్వన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు. 

Updated Date - 2021-10-18T21:50:47+05:30 IST