కామారెడ్డి మున్సిపల్‌కు రూ.50 కోట్లు మంజూరు చేస్తాం: కేసీఆర్

ABN , First Publish Date - 2021-06-21T01:40:56+05:30 IST

కామారెడ్డి మున్సిపల్‌కు రూ.50 కోట్లు మంజూరు చేస్తాం: కేసీఆర్

కామారెడ్డి మున్సిపల్‌కు రూ.50 కోట్లు మంజూరు చేస్తాం: కేసీఆర్

కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్‌కు రూ.50 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన బాన్సువాడ, ఎల్లారెడ్డి‌కి కూడా రూ. 25 కోట్ల చొప్పున నిధులు ఇస్తామన్నారు. జిల్లాలోని 526 గ్రామపంచాయతీలకు 10 లక్షల నిధులు తక్షణమే మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వైద్య కళాశాల కామారెడ్డిలో వచ్చే సంవత్సరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లాకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి 25 టీఎంసీల నీటిని కామారెడ్డి పరిసర గ్రామాలకు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-21T01:40:56+05:30 IST