అంబేద్కర్ కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-04-14T22:52:46+05:30 IST
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131 జయంతిని పురస్కరించుకుని గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131 జయంతిని పురస్కరించుకుని గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, నవీన్ రావు, ఎమ్మెల్యే మాధవరం క`ష్ణా రావు, సీఎం సెక్రకటరీ రాజశేఖర్ రెడ్డి, ఓఎస్డీ దేశ పతి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్, సీఎంవో అధికారులు తదితరులుపాల్గొన్నారు.