CM KCR: కాసేపట్లో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య భేటీ
ABN , First Publish Date - 2022-10-05T17:39:48+05:30 IST
కాసేపట్లో తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో టీఆర్ఎస్ సర్వసభ్య భేటీ కానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన
హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో టీఆర్ఎస్ సర్వసభ్య భేటీ కానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీని జాతీయ స్థాయికి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తోంది, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులేంటి అన్నది వివరిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రాంతీయ పార్టీల పట్ల ఆ పార్టీ వైఖరిని వివరించనున్నారు. తమ జాతీయ పార్టీ లక్ష్యాలు, అజెండాను వెల్లడించనున్నారు. అనంతరం సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్న మొత్తం 283 మంది.. టీఆర్ఎస్ పార్టీ మార్పునకు సంబంధించిన తీర్మానంపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ నోట జాతీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన రానుంది. ఇంతకుముందు ప్రగతిభవన్లో కేసీఆర్తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. జేడీయూ ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతిభవన్కు కుమారస్వామి వస్తారు. అలాగే తమిళనాడు వీసీకే అధ్యక్షుడు తిరుమావలవన్ కేసీఆర్ను కలిసశారు. ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో తిరుమావలవన్ ప్రగతిభవన్కు వచ్చారు.