KCR Sabha: యూపీలో లక్షలాదిమందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ!
ABN , First Publish Date - 2022-09-01T20:56:03+05:30 IST
బిహార్ పర్యటన విజయవంతం కావడంతో టీఆర్ఎస్ (TRS)లో జోష్ నింపింది.
హైదరాబాద్ (Hyderabad): బిహార్ పర్యటన విజయవంతం కావడంతో టీఆర్ఎస్ (TRS)లో జోష్ నింపింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) త్వరలో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పర్యటనకు ప్లాన్ (Plan) చేస్తున్నారు. లక్షలాదిమందితో భారీ బహిరంగసభ (public meeting) ఏర్పాటు చేయనున్నారు. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకావశం ఉంది. కలిసివచ్చే పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు.
నిన్న బిహర్ (Bihar) పర్యటనలో నితిష్ కుమార్ (Nitish Kumar)తో కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీ (BJP) పాలిత ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో రైతుల మద్దతు తీసుకుని భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) విధానాలతోపాటు, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి అంశాన్ని ప్రజా వేదికగా ఎండగట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఇటీవల జాతీయ రైతు సంఘాల నేతలతో ప్రగతి భవన్లో రెండు రోజులు సమావేశాలు నిర్వహించారు. దేశంలో వ్యవసాయం ఏదుర్కొంటున్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే.