యాదాద్రి దివ్యక్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-03-04T17:58:44+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం యాదాద్రి దివ్యక్షేత్రానికి చేరుకున్నారు.

యాదాద్రి దివ్యక్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్

యాదాద్రి-భువనగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం యాదాద్రి దివ్యక్షేత్రానికి చేరుకున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 14వ సారి పాంచనారసింహుడి దివ్యక్షేత్రానికి సీఎం వచ్చారు. మరి కొద్ది క్షణాల్లో బాలాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆలయ ప్రధాన పనులన్నీ పూర్తి కాగా మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. పనులను పరిశీలించిన తర్వాత గుడి ప్రారంభం తేదీని కూడా సీఎం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2021-03-04T17:58:44+05:30 IST