పీఆర్సీపై సీఎం గారడీ లెక్కలు
ABN , First Publish Date - 2022-01-22T06:24:30+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పీఆర్సీ అమలు విషయంలో ముఖ్యమంత్రి గారడీ లెక్కలు చూపుతున్నారని టీడీపీ అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి అన్నారు.
టీడీపీ ‘అరకు’ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి విమర్శ
ఉద్యోగుల ఆందోళనలకు మద్దతు
చింతపల్లి, జనవరి 21: ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పీఆర్సీ అమలు విషయంలో ముఖ్యమంత్రి గారడీ లెక్కలు చూపుతున్నారని టీడీపీ అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. మధ్యంతర భృతి (ఐఆర్) కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని, ఈ ఘనతను వైసీపీ ప్రభుత్వం సాధించిందని ఎద్దేవా చేశారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, డీఏల విషయంలో జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న అన్న రకాల ఆందోళనలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు లకే చైతన్య, చల్లంగి లక్ష్మణరావు, కె.గంగాధర్ పాల్గొన్నారు.