ఈరోజు కరోనా టీకా మొదటి డోసు తీసుకోనున్న సీఎం!

ABN , First Publish Date - 2021-03-01T12:19:26+05:30 IST

దేశవ్యాప్తంగా ఈరోజు(మార్చి 1) నుంచి కరోనా వ్యాక్సినేషన్...

ఈరోజు కరోనా టీకా మొదటి డోసు తీసుకోనున్న సీఎం!

పట్నా: దేశవ్యాప్తంగా ఈరోజు(మార్చి 1) నుంచి కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ ప్రారంభంకానుంది. ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కరోనా టీకా వేయించుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన బీహార్‌లోని ఐజీఐఎంఎస్ ఆసుపత్రిలో టీకా మొదటి డోసు వేయించుకోనున్నారు. సీఎంతో పాటు మరికొందరు రాజకీయ నేతలు కూడా ఈరోజు టీకా వేయించుకోనున్నారు.


ఈ రోజు నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో పాటు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా కరోనా టీకాలు వేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాతనే వ్యాక్సిన్ వేయనున్నారు. బీహార్‌లో మొత్తం 1600 కేంద్రాలలో కరోనా టీకాలను వేయనున్నారు. ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో రోజుకు వందమందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2021-03-01T12:19:26+05:30 IST