ప్రజల ఆరోగ్యం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ: ఎంపీ

ABN , First Publish Date - 2021-05-11T04:58:51+05:30 IST

ప్రజల ఆరోగ్యంపట్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కడప ఎంపీ అవినా్‌షరెడ్డి అన్నారు.

ప్రజల ఆరోగ్యం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ: ఎంపీ
ఐసోలేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంపీ అవినా్‌షరెడ్డి

బద్వేలు, మే 10: ప్రజల ఆరోగ్యంపట్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కడప ఎంపీ అవినా్‌షరెడ్డి అన్నారు. సోమవారం బద్వేలులోని స్థానిక బాలయోగి గురుకుల పాఠశాలలో 140 పడకలతో కరోనా రోగులకోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌ను ఎమ్మె ల్సీ గోవిందరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినా్‌షరెడ్డి మాట్లాడుతూ కరోనా సోకిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోదన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏడు కేంద్రాలను ప్రారంభించామని, మరో రెండు రోజుల్లో రాజంపేటలో కూడా కరోనా సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ కర్ఫ్యూను విజయవంతం చేయాలన్నారు. అనతరం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేలులో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పా టుతో మెరుగైన వైద్యసేవలు అందించవచ్చన్నారు. ఏపీ సగర బీసీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గానుగపెంట రమణమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ గోపాలస్వామి, మార్కెట్‌యార్డు వైస్‌ఛైర్మన్‌ రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:58:51+05:30 IST