వైద్య ఆరోగ్య శాఖపై CM Jagan సమీక్ష
ABN , First Publish Date - 2022-06-13T23:07:06+05:30 IST
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్య శ్రీ , వైద్య ఆరోగ్య శాఖలో
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్య శ్రీ , వైద్య ఆరోగ్య శాఖలో నాడు, నేడు పనులపై చర్చించారు. కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు. ఏ తరహా ప్రసవం జరిగినా ఇకపై తల్లికి రూ. 5 వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సహజ ప్రసవంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులదేనన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో మరిన్ని వ్యాధులను చేర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా డబ్బు ఆటో డెబిట్ అయ్యేలా చూడాలన్నారు. 18 సంవత్సరాల్లోపు వారికి కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసేలా చూడాలని సూచించారు. 2020లో ఏపీలో క్యాన్సర్తో 34 వేల మంది మృతిచెందారని గుర్తుచేస్తూ..క్యాన్సర్ను తొలిదశలో గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం జగన్.