అమరవీరుల వారసులకు రూ.20లక్షలు

ABN , First Publish Date - 2021-12-01T16:14:36+05:30 IST

సైన్యంలో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు సైనికుల వారసులకు తలా రూ.20లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అందజేశారు. కెప్టెన్‌ కుబేర్‌ గాందీరాజ్‌కు ప్రశంసాపత్రం అందించి

అమరవీరుల వారసులకు రూ.20లక్షలు

              - అందజేసిన Cm Stalin


చెన్నై: సైన్యంలో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు సైనికుల వారసులకు తలా రూ.20లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అందజేశారు. కెప్టెన్‌ కుబేర్‌ గాందీరాజ్‌కు ప్రశంసాపత్రం అందించి అభినందించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంచీపురం జిల్లా చెంబరం బాక్కంకు చెందిన దివంగత మాజీ సైనికుడు కే ఏకాంబరం సతీమణి ఇ.కుమారికి, తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టికి చెందిన దివంగత మాజీ సైనికుడు కె.కరుప్ప సామి సతీమణి ఆర్‌.దమయంతి దేవి, తేని జిల్లా ఉత్తమ పాళయంకు చెందిన దివంగత మాజీ సైనికుడు పి.పళనికుమార్‌ సతీమణి జి. పాండియమ్మాళ్‌కు కార్గిల్‌ యుద్ధ సైనికుల నివారణ నిధి నుంచి తలా రూ.20 లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని జోషిమత్‌ వద్ద మంచు పర్వతాల్లో నిర్వహించిన సైనికుల ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న తిరువణ్ణామలైకి చెందిన కెప్టెన్‌ ఎస్‌.కుబేర గాంధీరాజ్‌కు ప్రశంసాపత్రం అంద జేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T16:14:36+05:30 IST