Cm Stalinకు శ్రీలంక ప్రధాని కృతజ్ఞతలు
ABN , First Publish Date - 2022-05-24T13:16:51+05:30 IST
శ్రీలంక ప్రజలకు ఆదుకునేందుకు సాయం చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్కు ఆ దేశ ప్రధాని రనిల్ విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న
పెరంబూర్(చెన్నై): శ్రీలంక ప్రజలకు ఆదుకునేందుకు సాయం చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్కు ఆ దేశ ప్రధాని రనిల్ విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రజలను ఆదుకొనేలా 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల పాల పౌడర్, 137 రకాల మందులు పంపనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఆ ప్రకారం తొలివిడత సహాయాలతో బయల్దేరిన నౌక శనివారం శ్రీలంక చేరుకోగా, శ్రీలంకలోని భారత రాయబారి ఆ వస్తువులను శ్రీలంక ఉన్నతాధికారులకు అప్పగించారు. ఈ నేపధ్యంలో, శ్రీలంక ప్రజలను ఆదుకొనేలా నివారణ సహాయాలు పంపిన సీఎం స్టాలిన్కు ఆ దేశ ప్రధాని రనిల్ విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మిగిలిన సరుకులను త్వరలో పంపనున్నట్లు రాష్ట్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.