తిరుపతికి జగన్

ABN , First Publish Date - 2022-06-21T22:57:51+05:30 IST

అమరావతి: సీఎం జగన్‌ గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు తిరుపతి చేరుకుంటారు. 11.15 – 11.45

తిరుపతికి జగన్

అమరావతి: సీఎం జగన్‌ గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు తిరుపతి చేరుకుంటారు. 11.15 – 11.45 గంటల మధ్య వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుని, హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌ భూమి పూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్ద వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.50 గంటలకు  తాడేపల్లికి చేరుకుంటారు. 



Updated Date - 2022-06-21T22:57:51+05:30 IST