సీఎంఆర్ను వేగవంతంగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-08-09T05:47:23+05:30 IST
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శ ర్మ అదేశించారు. నల్లగొండలోని ఎఫ్సీఐ గోదామును సోమవారం పరిశీలించారు. ఎఫ్సీఐకి సీఎంఆర్ డెలివరీ తీరును పరిశీలించారు. మిల్లర్లు ఎఫ్సీఐ సీఎంఆర్ డెలవరీ, ఎఫ్సీఐ స్వీకరణ వేగవం తం చేయాల న్నారు.
కలెక్టర్ రాహుల్శర్మ
నల్లగొండ టౌన్, ఆగ స్టు 8: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శ ర్మ అదేశించారు. నల్లగొండలోని ఎఫ్సీఐ గోదామును సోమవారం పరిశీలించారు. ఎఫ్సీఐకి సీఎంఆర్ డెలివరీ తీరును పరిశీలించారు. మిల్లర్లు ఎఫ్సీఐ సీఎంఆర్ డెలవరీ, ఎఫ్సీఐ స్వీకరణ వేగవం తం చేయాల న్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్రావు, సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యానందం తదితరులు ఉన్నారు.
పెండింగ్ ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి : కలెక్టర్
ప్రజావాణి కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్కు దరఖాస్తులు అందజేశారు. ఆర్జీలను వెంటనే పరిశీలించి ప్రజావాణి సైట్లో వివరాలు అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.