మరోసారి పెరిగిన CNG ధరలు
ABN , First Publish Date - 2022-04-06T14:01:05+05:30 IST
దేశంలో పెట్రో ధరలే కాదు బుధవారం నుంచి సీఎన్జీ ధరలు కూడా పెరిగాయి....
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలే కాదు బుధవారం నుంచి సీఎన్జీ ధరలు కూడా పెరిగాయి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర బుధవారం కిలోకు రూ.2.5 పెరిగింది. ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.66.61కి చేరింది.గత ఐదు రోజులుగా సీఎన్జీ ధర కిలోకు రూ.6.6 పెరిగింది.నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో సీఎన్జీ కిలో ధర రూ.69.18 అయింది. ముజఫర్ నగర్, మీరట్, షామ్లీలలో కిలో రూ.73.86కు పెరిగింది. గురుగ్రామ్ నగరంలో సీఎన్జీ కిలో ధర రూ.74.94కు పెరిగింది.రేవారిలో కిలో సీఎన్జీ ధర రూ.77.07, కాన్పూర్, హమీర్పూర్, ఫతేపూర్ నగరాల్లో కిలో రూ.78.40లకు పెరిగింది. సీఎన్జీ ధరలు పెరుగుదలతో ప్రజలపై అదనపు భారం పడుతోంది.