కోఆప్షన్‌ పదవులకు పోటాపోటీ

ABN , First Publish Date - 2021-05-09T06:22:59+05:30 IST

నగరపంచాయతీ కోఆప్షన్‌ సభ్యుల పదవుల కోసం పలువురు తీవ్ర ప్రయత్నా లు చేస్తున్నారు. మైనారిటీ కోటా కింద నియమించే ఇద్దరు సభ్యుల విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

కోఆప్షన్‌ పదవులకు పోటాపోటీ
అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం

పాలనా అనుభవం కోటాలో పలువురు ప్రయత్నాలు 

మూడింటినీ ముస్లింలకు ఇచ్చే ఛాన్స్‌


అద్దంకి, మే 8: నగరపంచాయతీ కోఆప్షన్‌ సభ్యుల పదవుల కోసం పలువురు తీవ్ర ప్రయత్నా లు చేస్తున్నారు. మైనారిటీ కోటా కింద నియమించే ఇద్దరు సభ్యుల విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మైనారిటీ మహిళా కోటాలో 14వ వా ర్డు నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓటమి చెం దిన షేక్‌ అమిరూన్‌ పేరు దాదాపు ఖరారైనట్లు స మాచారం. మైనారిటీ కోటాలో ఉన్న మరో పదవి కోసం 1వ వార్డులోని దూదేకుల సామాజిక వర్గాని కి చెందిన షేక్‌ మస్తాన్‌, 19వ వార్డు మాజీ కౌన్సి లర్‌ షేక్‌ మహబూబ్‌ బాషాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మస్తాన్‌కు అవకాశం ఇస్తే, పాలనా అ నుభవం కోటాలో మాజీ కౌన్సిలర్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యుడిగా అనుభవం ఉన్న షేక్‌ మహబూబ్‌ బా షాకు ఛాన్స్‌ దక్కనుంది. అయితే రెండు పదవులు ముస్లింలకు ఇచ్చి, పాలనా అనుభవం కోటాలో ఇ తర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తే మాజీ కౌన్సిలర్‌ కొప్పోలు హనుమంతరావు, విశ్రాంత ఎ ఫ్‌ఐ చలమారెడ్డి  పేర్లను పరిగణలోకి తీసుకునే అ వకాశం ఉంది. వీరితోపాటు వడ్లవల్లి ఆంజనేయు లు, నాగసూరి శ్రీనివాసరావు కూడా పోటీ పడుతు న్నారు. కోఆప్షన్‌ పదవులు ఆశిస్తున్న  వ్యక్తులు తమ నాయకులను వెంటబెట్టుకొని వైసీపీ నియోజకవర్గ ఇ న్‌చార్జి బాచిన కృష్ణచైతన్యను ఒంగోలులో కలిశారు. నామినేషన్‌ల దాఖలుకు సోమవారం తుది గడువు కావటంతో  తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.


Updated Date - 2021-05-09T06:22:59+05:30 IST