తీరం.. చెత్తమయం.!

ABN , First Publish Date - 2021-10-17T06:22:39+05:30 IST

చెత్తాచెదారంతో తీరమంతా చెత్తమయంగా తయారైంది.

తీరం.. చెత్తమయం.!
తీరంలో అమ్మవారి విగ్రహం, ఇతర సామగ్రి

విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): చెత్తాచెదారంతో తీరమంతా చెత్తమయంగా తయారైంది. దసరా సందర్భంగా ఇళ్లలో పూజలు చేసినవారు, మండపాల్లో దుర్గాదేవి విగ్రహాలను నిలిపిన వారంతా శరన్నవరాత్రులు ముగియడంతో ప్రతిమలు, పూజాది సామగ్రిని సముద్రంలో నిమజ్జనం చేశారు. అయితే అలల ఉధృతికి అవన్నీ శనివారం ఒడ్డుకు కొట్టుకురావడంతో తీరం వెంబడి చెత్త పేరుకుపోయింది. రసాయన రంగులతో కూడిన విగ్రహాలు సంద్రంలో పూర్తిగా కరగకపోవడంతో ఒడ్డుకు కొట్టుకువచ్చి దీనంగా దర్శనమిస్తున్నాయి. 


Updated Date - 2021-10-17T06:22:39+05:30 IST