కోస్తాంధ్ర, ఒడిశా తీరంలో వర్షాలు: వాతావరణ శాఖ
ABN , First Publish Date - 2022-03-19T00:38:38+05:30 IST
కోస్తాంధ్ర, ఒడిశా తీరంలో వర్షాలు: వాతావరణ శాఖ
విశాఖపట్నం: అండమాన్ తీరం దగ్గర ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరింత బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటిలోగా పూర్తి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా తీరంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.