కాలినడక మార్గంలో నాగుపాము
ABN , First Publish Date - 2022-05-22T06:37:21+05:30 IST
అలిపిరి కాలినడక మార్గంలో శనివారం ఓ నాగుపాము భక్తులను హడలెత్తించింది.
తిరుమల, మే 21 (ఆంధ్రజ్యోతి): అలిపిరి కాలినడక మార్గంలో శనివారం ఓ నాగుపాము భక్తులను హడలెత్తించింది. 3,500 మెట్టుకు సమీపానికి వచ్చిన పామును గుర్తించిన భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. దగ్గరల్లోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్నాయుడిని పిలిపించారు. ఆయన తన వద్దనున్న పరికరాలతో సుమారు ఆరడుగుల పొడవు కల్గిన నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. దాంతో అక్కడివారు ఊపిరిపీల్చుకున్నారు. తొలుత పామును చూసి భయంతో పరుగులు తీసిన భక్తులు దాన్ని పట్టుకున్నాక చూడటానికి ఎగబడ్డారు. సెల్ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత నాగుపామును భాస్కర్నాయుడు దట్టమైన అడవిలో విడిచిపెట్టారు.