Viral Photo: రైల్వే అధికారి కార్యాలయాన్ని తనిఖీ చేసిన నాగుపాము.. టేబుల్పై కూర్చుని మరీ..
ABN , First Publish Date - 2022-06-03T15:16:01+05:30 IST
ప్రస్తుతం ఓ పాముకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పాముకు ఆ టేబుల్ అంతగా నచ్చేసిందా?’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివ
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ పాముకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పాముకు ఆ టేబుల్ అంతగా నచ్చేసిందా?’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా రైల్వే స్టేషన్ ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. నిత్యం కిటకిటలాడే స్టేషన్లోకి ఎలా వొచ్చిందో ఏమో కానీ ఓ నల్లటి నాగుపాము ప్రవేశించింది. అనంతరం నేరుగా కంట్రోల్ ప్యానెల్ ఉన్న రూమ్లోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడి అధికారి టేబుల్పై కూర్చుని రిలాక్స్ అయింది. ఈ క్రమంలో అనుకోని ఈ అతిథిని చూసి అక్కడి అధికారులు కంగుతిన్నారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటా డివిజన్లో ఉన్న రైల్వే స్టేషన్లో చోటు చేసుకోగా.. కొందరు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘కార్యాలయాన్ని పాము తనిఖీ చేస్తోంది’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.