టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య కొబ్బరి మొక్కల వివాదం
ABN , First Publish Date - 2021-12-18T22:58:08+05:30 IST
జిల్లాలోని ఉండి మండలం వెలివర్రులో టీడీపీ, వైసీపీ నాయకుల
పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఉండి మండలం వెలివర్రులో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య కొబ్బరి మొక్కల వివాదం జరిగింది. ఆర్ అండ్ బీ, వీర పేరంటాలమ్మ ఆలయ భూములలో టీడీపీ నాయకులు కొబ్బరి మొక్కలు నాటారని వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. అధికారులతో కలిసి మొక్కలను వైసీపీ నేతలు పీకి వేశారు. వైసీపీ నాయకులు పీకి వేసిన మొక్కలతో ఉండి ఎమ్మార్వో ఆఫీసు దగ్గరకు వచ్చి అధికారులను ఎమ్మెల్యే రామరాజు నిలదీశారు. మంచినీళ్ల పైప్లైన్పై మొక్కలు నాటడంతోనే మొక్కలను పీకి వేశామని గ్రామ వైసీపీ నాయకులు చెబుతున్నారు.