కోవై-షిర్డీ రైలు బుకింగ్‌కు రూ. కోటి డిపాజిట్‌

ABN , First Publish Date - 2022-04-06T15:45:32+05:30 IST

భారత్‌ గౌరవ్‌’ పథకం కింద కోయంబత్తూర్‌-షిర్డీ మధ్య రైలు నడిపేందుకు ఓ వ్యక్తి రూ. కోటి డిపాజిట్‌ చేశాడని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. భారతదేశంలో ఉన్న పారంప

కోవై-షిర్డీ రైలు బుకింగ్‌కు రూ. కోటి డిపాజిట్‌

ఐసిఎఫ్‌(చెన్నై): ‘భారత్‌ గౌరవ్‌’ పథకం కింద కోయంబత్తూర్‌-షిర్డీ మధ్య రైలు నడిపేందుకు ఓ వ్యక్తి రూ. కోటి డిపాజిట్‌ చేశాడని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. భారతదేశంలో ఉన్న పారంపర్య, సంస్కృతి, ఆధ్యాత్మిక, పర్యాటక స్థలాల సందర్శనకు విదేశాలకు చెందిన వారిని తీసుకెళ్లేందుకు భారత్‌ గౌరవ్‌ పథకాన్ని రైల్వేశాఖ ప్రకటించింది. ఆ ప్రకారం ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు బుకింగ్‌ చేసుకొని రైలు నడుపువచ్చు. ఆ ప్రకారం రైళ్ల పర్యవేక్షణ, స్టాపింగ్‌ వంటి సౌకర్యాలకు రైల్వే శాఖ సహాయం చేస్తోంది. రైళ్లు నడపడం మాత్రమే ప్రైవేటు సంస్థల పని. ఈ నేపధ్యంలో, మేలో కోయంబత్తూర్‌-షిర్డీ మధ్య భారత్‌ గౌరవ్‌ రైలు నడిపేందుకు ఓ వ్యక్తి రూ. కోటి డిపాజిట్‌ చేశారని, దక్షిణ రైల్వేలో ఏడుగురు వ్యక్తులు ఈ పథకం కింద రైళ్లు నడిపేందుకు నమోదుచేసుకున్నారని దక్షిణ రైల్వే తెలిపింది.

Updated Date - 2022-04-06T15:45:32+05:30 IST