కలెక్టర్‌కు ‘మేన ఆఫ్‌ ఎక్స్‌లెన్స’ అవార్డు

ABN , First Publish Date - 2020-11-28T03:57:44+05:30 IST

కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌కు ‘మేన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డు లభించింది. జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహించినందుకు ఢిల్లీకి చెందిన ఇండియన్‌ ఎఛీవర్స్‌ ఫోరమ్‌ ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది.

కలెక్టర్‌కు ‘మేన ఆఫ్‌ ఎక్స్‌లెన్స’ అవార్డు
కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ను అభినందిస్తున్న జేసీ కిషోర్‌కుమార్‌





అభినందనల వెల్లువ

కలెక్టరేట్‌/రింగురోడ్డు, నవంబరు 27: కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌కు ‘మేన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డు లభించింది. జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహించినందుకు ఢిల్లీకి చెందిన ఇండియన్‌ ఎఛీవర్స్‌ ఫోరమ్‌ ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. దేశంలో వివిధ రంగాల్లో సుదీర్ఘకాలం పాటు ఉత్తమ సేవలందించిన వారిని గుర్తించి  గత 20 ఏళ్లుగా  ఈ అవార్డులను అందిస్తూ వస్తోంది. ఈ ఏడాదికిగాను కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ను ఎంపిక చేసింది. దీంతో కలెక్టర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. జేసీ కిషోర్‌కుమార్‌, విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ, సహాయ కమిషనర్‌ ప్రసాద్‌రావు తదితరులు అభినందనలు తెలిపారు. జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారని కొనియాడారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ అందరి సహకారంతోనే తాను ఈ ఘనత సాధించినట్టు చెప్పారు.





Updated Date - 2020-11-28T03:57:44+05:30 IST