వలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే వేటు
ABN , First Publish Date - 2021-03-07T06:40:17+05:30 IST
వలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే వేటు
విజయవాడ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వలంటీర్లపై చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాకు అత్యవసర బులెటిన్ను విడుదల చేశారు. రాజకీయ పార్టీలకు లబ్ధి కలిగేలా ప్రచారం నిర్వహించి, ఓటర్లను ప్రభావితం చేయటం నిషిద్ధమన్నారు. ఈ ఆదేశాలను ఎవరైనా పక్కన పెడితే తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా వార్డు వలంటీర్లు ఎన్నికల నిబంధనలను కాదని అభ్యర్థులకు ప్రచారం చేసినా, లబ్ధి కలిగించే పనులు చేసినా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. దీనికోసం 24 గంటలూ పనిచేసే వాట్సాప్ నెంబర్ 8186038738కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ-మెయిల్ అడ్రస్ ఛీఞ్ఛౌజ్ఛూఛ్టిజీౌుఽట 2021ఃజఝ్చజీజూ.ఛిౌఝ కు కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.