విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
ABN , First Publish Date - 2021-02-26T05:08:01+05:30 IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైల్వేకోడూరులో గురువారం ఏఐఎ్సఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
రైల్వేకోడూరు, ఫిబ్రవరి 25: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైల్వేకోడూరులో గురువారం ఏఐఎ్సఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎ్సఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి దార్ల రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే 40వేల కుంటుంబాలు వీఽధిన పడతాయని ఆందోళన వక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి జయచంద్ర, ఏఐఎ్సఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.