రెండో డోసుకు.. తొలి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-05-07T05:52:13+05:30 IST

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తొలి ప్రాధాన్యం రెండవ డోసు వారికే ఇవ్వాలని ఆ తరువాతనే మొదటి డోసు తీసుకునే వారికి వ్యాక్సిన్‌ వేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ వైద్యాధికారులకు సూచించారు.

రెండో డోసుకు.. తొలి ప్రాధాన్యం

 గుంటూరు(తూర్పు): వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తొలి ప్రాధాన్యం రెండవ డోసు వారికే ఇవ్వాలని ఆ తరువాతనే మొదటి డోసు తీసుకునే వారికి వ్యాక్సిన్‌ వేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ వైద్యాధికారులకు సూచించారు. మెడికల్‌ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్జీవో కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన 3,20,000 మంది ఇప్పటికే మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాలలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి వ్యాక్సిన్‌ అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనై జేషన్‌ అధికారి చంద్రశేఖర్‌, ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T05:52:13+05:30 IST