ధరణి పోర్టల్పై అవగాహన కలిగి ఉండాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-09-27T11:14:01+05:30 IST
ధరణి పోర్టల్పై అవగాహన కలిగి ఉండాలి : కలెక్టర్
జగిత్యాల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి పోర్టల్పై అధికారులు, ప్ర జాప్రతినిదులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రవి అన్నారు. శ నివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యే సం జయ్తో కలిసి మున్సిపల్ చైర్మన్లు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిష నర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప లు సూచనలు చేశారు. ప్రతి మున్సిపాలిటీ వారిగా ఆస్తుల వివరాలను సేకరించాలన్నారు. వార్డు వారిగా ఇన్చార్జులను నియమించి ఆస్తి వివ రాలను సేకరించడానికి అవసరమైన సిబ్బందిని వాడుకో వాలని ప్రజా ప్రతినిదులు వారి సహాయ సహకారాలు అందించాలన్నారు. పకడ్భంది గా యజమాని పూర్తి వివరాలు ఆస్తి కుటుంబ సభ్యుల వివరాలను సే కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్ మాట్లాడారు.
సీఎం కేసీఆర్ రెవెన్యూ చట్టంలో లొసుగులను తొలగిం చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టి ధరణి వెబ్ సైట్ను ప్రవేశపెట్టారని అ న్నారు. ధరణి వెబ్సైట్లో మున్సిపాలిటీలోని ఆస్తుల వివరాలను సేక రించే సమయంలో అధికారులు ప్రజప్రతినిధులు పూర్తి సహాయ స హకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్ట ర్ రాజేశం, అదనపు కలెక్టర్ అరుణశ్రీలతో పాటు కోరుట్ల, మెట్పల్లి, దర్మపురి, రాయికల్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్లు, తహసీల్దార్, కమి షనర్లతో పాటు పలువురు పాల్గొన్నారు.