రైతు వేదికలను త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-24T10:13:12+05:30 IST
రైతు వేదికల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. మండలంలోని కొనాయిమాకుల, విశ్వనాథపురం, శాయంపేటహవేలి గ్రామాల్లో రైతు వేదికలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్
గీసుగొండ, నవంబరు 23: రైతు వేదికల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. మండలంలోని కొనాయిమాకుల, విశ్వనాథపురం, శాయంపేటహవేలి గ్రామాల్లో రైతు వేదికలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ ఎన్నిసార్లు హెచ్చరించినా రైతు వేదికల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్రావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్లు డోలి రాధ, రజిత, నాగేశ్వర్రావు, ఎంపీటీసీలు భిక్షపతి, వీరారావు, ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎంపీవో శేషు, ఆర్ఐ అర్జున్, డీఈ దేవేందర్రావు, ఏపీవో మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.