ట్రక్‌ల కోసం రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2020-11-27T05:50:13+05:30 IST

మొబైల్‌ డిస్పెన్సింగ్‌ నాలుగు చక్రాల మినీ ట్రక్‌ యూనిట్లకి సంబంధించి దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు స్వీకరిస్తామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ట్రక్‌ల కోసం రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మొబైల్‌ డిస్పెన్సింగ్‌ నాలుగు చక్రాల మినీ ట్రక్‌ యూనిట్లకి సంబంధించి దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు స్వీకరిస్తామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 902 ట్రక్కులు కేటాయించారని చెప్పారు. కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ. 12 వేల లోపు ఉండి ఏడో తరగతి ఉత్తీర్ణులై ఎల్‌ఎంవీ లైసెన్సు ఉన్న 21 నుంచి 45 ఏళ్ల లోపు యువత వీటికి అర్హులన్నారు. రూ.5,81,190 విలువ చేసే వాహనానికి 60 శాతం సబ్సిడీ ఉందన్నారు. 30 శాతం బ్యాంకు రుణం కాగా లబ్ధిదారుడు కేవలం 10 శాతం సమకూర్చుకుంటే సరిపోతుందన్నారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను సమీపంలోని సచివాలయంలో అందజేయాలని సూచించారు. 

Updated Date - 2020-11-27T05:50:13+05:30 IST