అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-03T05:49:19+05:30 IST
పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామం, షెడ్ల నిర్మాణ పనులు త్వరతిగతిన పూర్తిచేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు.
మునగాల, డిసెంబరు 2: పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామం, షెడ్ల నిర్మాణ పనులు త్వరతిగతిన పూర్తిచేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బిల్లుల కేటాయింపులు, జమా ఖర్చుల వివరాలను పరిశీలించారు. ప్ర భుత్వం ఆశించిన స్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయడం లేదని, నర్సింహులగూడెం, జగన్నాథపురం గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు పూర్తికాకపోవడంతో అధికారులను మందలించారు. చిన్నచిన్న కారణాలతో ప్రభుత్వ పథకాల పురోగతి మందగిస్తుందని, పనుల్లో నిర్ల క్ష్యం, అధికారుల సమన్వయ లోపం కన్పిస్తోందన్నారు. అంతక ముం దు మండల పరిధిలోని తాడువాయి పీఏసీఎస్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఽకొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎలక బిందు, ఎంపీడీవో వెం కటేశ్వర్లు, ఏవో అనిల్కుమార్, భూపాల్రెడ్డి, ఏపీవో శేఖర్ పాల్గొన్నారు.