ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-03-06T05:15:38+05:30 IST
ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్
పరకాల, మార్చి 5 : పరకాల పట్టణంలో నిర్మించ తలపెట్టిన వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత కూరగాయల భవన నిర్మాణ స్థలం కోసం ప్రభుత్వ భూములను కలెక్టర్ హరిత శుక్రవారం పరిశీలించారు.పట్టణంలోని పాత సీఎంఎస్ గోదాం, డాబ్బంగ్లా, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని భూములను పరిశీలించారు. అనంతరం మునిసిపాలిటీ కార్యాలయం సమీపంలోని నర్సరీని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్రెడ్డి, మునిసిపల్ కమిషనర్ శేషు, చైర్మన్ అనిత, కౌన్సిలర్లు రాజు, పంచగిరి జయమ్మ, జయపాల్రెడ్డి, రజనీ, తదితరులు ఉన్నారు.