సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయండి
ABN , First Publish Date - 2021-10-24T05:47:37+05:30 IST
సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అలసత్వం పనికిరాదని కొత్తపేట షాదీఖానాలోని సచివాలయ సిబ్బందికి కలెక్టర్ నివాస్, నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్లు సూచించారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయండి
కలెక్టర్, కమిషనర్ సూచన
వన్టౌన్, అక్టోబరు 23: సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అలసత్వం పనికిరాదని కొత్తపేట షాదీఖానాలోని సచివాలయ సిబ్బందికి కలెక్టర్ నివాస్, నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్లు సూచించారు. సచివాలయాన్ని శనివారం సంయుక్తంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడిన అధికారులు పథకాల వివరాలను డిస్ప్లే బోర్డులలో ఏర్పాటు చేయాలన్నారు. అధికారుల వెంట 53, 52 డివిజన్ల కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, ఉమ్మడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.