కంటైన్మెంట్ జోన్లలో నిర్ల్యక్షం వద్దు
ABN , First Publish Date - 2020-07-06T10:24:18+05:30 IST
కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారందరికీ కొవిడ్ పరీక్షలు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని..
వలస కూలీల రాకతో కేసులు పెరిగాయి
కలెక్టర్ నివాస్
ఇచ్ఛాపురం, జూలై 5: కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారందరికీ కొవిడ్ పరీక్షలు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ నివాస్ తెలిపారు. ఆదివారం మునిసిపల్ కార్యాలయంలో ప్రైవేటు వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్షించారు. అలాగే పట్టణంలోని కంటైన్మెంట్ జోన్లలో పర్య టించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వలస కూలీలు రావడంతో కరోనా కేసులు పెరిగాయని తెలిపారు. ప్రైవేటు క్లీనిక్లకు కొవిడ్ లక్షణాలు ఉన్నవారు వస్తే వివరాలు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో కిశోర్, కమిషనర్ రామలక్ష్మి, తహసీల్దార్ పి.అమల పాల్గొన్నారు.
నేటి నుంచి లాక్డౌన్
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో సోమవారం నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం ఆరు నుంచి ఒంటి వంట వరకే దుకాణాలు తెరవాలన్నారు.