ఫిర్యాదు చేసేందుకు వచ్చిందని..
ABN , First Publish Date - 2022-06-29T15:26:16+05:30 IST
తనపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన భార్యను చితకబాదిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నపాలంనకు చెందిన మాజీ
- కలెక్టర్ కార్యాలయంలో భార్యపై దాడి: వ్యక్తి అరెస్టు
వేలూరు(చెన్నై), జూన్ 28: తనపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన భార్యను చితకబాదిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నపాలంనకు చెందిన మాజీ సైనికుడు. మేల్మురుగన్ (45) భార్య సుభాషిణి (35). కాగా గత కొంతకాలంగా మద్యానికి బానిసైన వేల్మురుగన్.. చీటికిమాటికి భార్యపై చేయి చేసుకుంటున్నాడు. దీంతో అతనిపె చర్యలు తీసుకోవాలంటూ సుభాషిణి ఫిర్యాదు చేసేందుకు మంగళవారం వేలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. అది గ్రహించిన వేల్మురుగన్ అక్కడకు వెళ్లి భార్యను చితగొట్టాడు. ఈ ఘటన చూసిన పోలీసులు.. అతనిని అరెస్టు చేసి సుభాషిణిని వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.