మిషన్‌భగీరథ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-30T03:45:22+05:30 IST

జడ్చర్ల మునిసిపాలిటీ నాగసాల సమీపంలోని పందిరిగుట్ట వద్ద ఉన్న వాటర్‌ట్రీట్‌మెంట్‌ప్లాంటును ఆదివారం కలెక్టర్‌ వెంకట్రావు పరిశీలించారు.

మిషన్‌భగీరథ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్‌
జడ్చర్ల పందిరిగుట్ట వద్ద ఉన్న వాటర్‌ట్రీట్‌మెంట్‌ ప్లాంటును సందర్శించిన కలెక్టర్‌ వెంకట్రావు

జడ్చర్ల, నవంబరు 29 : జడ్చర్ల మునిసిపాలిటీ నాగసాల సమీపంలోని పందిరిగుట్ట వద్ద ఉన్న వాటర్‌ట్రీట్‌మెంట్‌ప్లాంటును ఆదివారం కలెక్టర్‌ వెంకట్రావు పరిశీలించారు. మిషన్‌భగీరథ పథకంలో భాగంగా శుద్ధి నీటి సరఫరా ప్రక్రియను పరిశీలించారు. కృష్ణజలాలు వాటర్‌ట్రీట్‌ప్లాంటుకు చేరుకునే విధానంతో పాటు నీటిని శుద్ధి చేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఎర్రగుట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల తహసీలార్‌ లక్ష్మీనారాయణ, మిషన్‌భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T03:45:22+05:30 IST