తెలంగాణ గవర్నర్కు కలెక్టర్ స్వాగతం
ABN , First Publish Date - 2021-05-15T05:01:00+05:30 IST
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పు దుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ డా. తమిళ సై సౌందరరాజన్కు కడప విమానాశ్రయంలో కలెక్టర్ హరికిరణ్ శుక్రవారం స్వాగతం పలికారు.
కడప(కలెక్టరేట్), మే 14: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పు దుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ డా. తమిళ సై సౌందరరాజన్కు కడప విమానాశ్రయంలో కలెక్టర్ హరికిరణ్ శుక్రవారం స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళుతూ శుక్రవారం ఉదయం 10-25 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ డా.తమిళసై సౌందరరాజన్కు కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్ ఉదయం 11-05 గంటలకు పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో, కడప, వల్లూరు తహసీల్దార్లు శివరామిరెడ్డి, సుహాసిని, కడప డీఎస్పీ సునీల్, ఎయిర్ ఫోర్టు డైరెక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు.