తెలంగాణ గవర్నర్‌కు కలెక్టర్‌ స్వాగతం

ABN , First Publish Date - 2021-05-15T05:01:00+05:30 IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, పు దుచ్చేరి లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ డా. తమిళ సై సౌందరరాజన్‌కు కడప విమానాశ్రయంలో కలెక్టర్‌ హరికిరణ్‌ శుక్రవారం స్వాగతం పలికారు.

తెలంగాణ గవర్నర్‌కు కలెక్టర్‌ స్వాగతం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందరరాజన్‌కు స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌ హరికిరణ్‌

కడప(కలెక్టరేట్‌), మే 14: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, పు దుచ్చేరి లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ డా. తమిళ సై సౌందరరాజన్‌కు కడప విమానాశ్రయంలో కలెక్టర్‌ హరికిరణ్‌ శుక్రవారం స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరికి వెళుతూ శుక్రవారం ఉదయం 10-25 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్‌ డా.తమిళసై సౌందరరాజన్‌కు కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ అన్బురాజన్‌ ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్‌ ఉదయం 11-05 గంటలకు పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో, కడప, వల్లూరు తహసీల్దార్లు శివరామిరెడ్డి, సుహాసిని, కడప డీఎస్పీ సునీల్‌, ఎయిర్‌ ఫోర్టు డైరెక్టర్‌ శివప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-05-15T05:01:00+05:30 IST