ఉప ఎన్నికల తీరును వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-04-18T06:06:23+05:30 IST
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించారు.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 17: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించారు. శనివారం ఉదయం 5.30 గంటలకల్లా కలెక్టరేట్కు చేరుకున్న కలెక్టర్ గ్రీవెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించారు. అక్కడి ఐఅండ్పీఆర్ సిబ్బంకి సూచనలు చేశారు. అనంతరం మీటింగ్ హాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఆరు గంటలకు ప్రారంభమైన మాక్పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభించిన అధికారులను మందలించారు. వీవీ ప్యాట్లోని స్లిప్పులను తొలగించి పోలింగ్ సరిగ్గా 7 గంటలకల్లా ప్రారంభించే విధంగా సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఆర్వోమురళి, సీపీవో అప్పలకొండ, ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్ కోదండరామిరెడ్డి ఉన్నారు.