డిగ్రీ కాలేజీలో వ్యభిచార ముఠా.. విద్యార్థిని ఫిర్యాదుతో వెలుగులోకి.. నిందితుడు ఎవరో తెలిస్తే షాక్

ABN , First Publish Date - 2021-11-23T16:08:02+05:30 IST

ఒక మహిళా డిగ్రీ కాలేజీలో గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ఉంటూ డబ్బు సంపాదన కోసం చదువుకునే అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ విషయం ఒక యువకుడు కాలేజీ మేనేజ్‌మెంట్ వారికి తెలియపరిచినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు...

డిగ్రీ కాలేజీలో వ్యభిచార ముఠా.. విద్యార్థిని ఫిర్యాదుతో వెలుగులోకి.. నిందితుడు ఎవరో తెలిస్తే షాక్

ఒక మహిళా డిగ్రీ కాలేజీలో గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ఉంటూ డబ్బు సంపాదన కోసం చదువుకునే అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ విషయం ఒక యువకుడు కాలేజీ మేనేజ్‌మెంట్ వారికి తెలియపరిచినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ యువకుడు మరో విద్యర్థినితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగేసరికి ఆ నిందితుడు పరారయ్యాడు.


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ నగరంలో రాజకీయ మహిళా మహావిద్యాలయ అనే డిగ్రీ కళాశాల ఉంది. ఆ కళాశాలలో 2016 సంవత్సరంలో కొత్తగా ఒక ప్రొఫెసర్ వచ్చాడు. అతని పేరు కమ్రాన్ ఆలం ఖాన్. అది మహిళా కళాశాల కావడంతో అక్కడ చదువుకునే అమ్మాయిలను బయటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి తాగించేవాడు. అలా తాగించిన తరువాత వారిపై అత్యాచారం చేసి వీడియో తీసేవాడు. స్పృహలోకి వచ్చిన తరువాత అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల చేత వ్యభిచారం చేయించేవాడు.


ఆ ప్రొఫెసర్ బాధితులలో ఒక విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్‌తో తన బాధ చెప్పుకుంది. అతను ఈ విషయాన్ని కాలేజీ యజమాన్యం దృష్టికి తీసుకొచ్చాడు. కానీ ఫలితం లేకపోయేసరికి ఆ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విద్యార్థిని ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. మరికొందరు బాధితులు కూడా మందుకొచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ప్రొఫెసర్ ఆలం ఖాన్‌ని అరెస్టు చేయాలని పోలీసులు వెళ్లగా అతను పరారీలో ఉన్నాడు.

ప్రస్తుతం నిందితుడు ఆలం ఖాన్‌పై పోలీసులు వ్యభిచార కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.


Updated Date - 2021-11-23T16:08:02+05:30 IST