మధ్యాహ్నం 2 గంటలకు మండుటెండలో కొట్టుకున్న ఇద్దరు యువతులు.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..

ABN , First Publish Date - 2022-04-07T21:20:51+05:30 IST

వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా కొన్ని విద్యాసంస్థలు మధ్యాహ్నం వరకే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కాలేజీ నుంచి బయటి

మధ్యాహ్నం 2 గంటలకు మండుటెండలో కొట్టుకున్న ఇద్దరు యువతులు.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..

ఇంటర్నెట్ డెస్క్: వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా కొన్ని విద్యాసంస్థలు మధ్యాహ్నం వరకే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కాలేజీ నుంచి బయటికొచ్చిన ఇద్దరు యువతులు గొడవకు దిగారు. అది చూసిన స్థానికులు.. తొలుత వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీరా విషయం తెలిసిన తర్వాత ఆ దృశ్యాలను వీడియో తీయడం ప్రారంభించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైలర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యువతుల మధ్య గొడవకు గల కారణం ఏంటనే విషయంలోకి వెళితే..



ఇద్దరు యువతులు తమిళనాడులోని అన్నానగర్‌లో ఉన్న వేరు వేరు కాలేజీల్లో చదువుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో మధ్యాహ్నం కాలేజీలు ముగియగానే.. ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చారు.  బస్టాప్‌లో బస్సు కోసం ఎదురు చూస్తూ.. ఒకరికొకరు ఎదురుపడ్డారు. అంతే.. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ ఇద్దరు యువతులు.. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. దీంతో స్థానికులు తొలుత వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత.. బాయ్ ఫ్రెండ్ కోసమే ఆ ఇద్దరు యువతులు కొట్టుకుంటున్నారని తెలిసి షాకయ్యారు. ఈ క్రమంలోనే కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో.. ఇద్దరు యువతుల కాలేజీ యాజమాన్యాలు స్పందించాయి. వాళ్ల లవ్ ఎఫైర్‌పై విచారణ జరిపనున్నట్టు వెల్లడించాయి. 




Updated Date - 2022-04-07T21:20:51+05:30 IST