ఏ రంగు పండుతో ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే..?

ABN , First Publish Date - 2022-05-24T18:35:00+05:30 IST

ఆకర్షణీయమైన రంగులతో కూడిన పండ్లు, కూరగాయల్లో విలువైన పోషకాలుంటాయి

ఏ రంగు పండుతో ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే..?

ఆంధ్రజ్యోతి(24-05-2022)

ఆకర్షణీయమైన రంగులతో కూడిన పండ్లు, కూరగాయల్లో విలువైన పోషకాలుంటాయి. వాటిలో ఉండే ఫైటోకెమికల్స్‌ను బట్టి పండ్లు, కూరగాయలకు ఆయా రంగులు సమకూరతాయి. అయితే ఒక్కో రంగుకు కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 


అవేంటంటే...

ఆకుపచ్చ: ఈ రంగుతో కూడిన పండ్లు, కూరగాయలను తినడం వల్ల జీర్ణశక్తి, కాలేయ పనితీరు మెరుగవుతుంది. దంతాలు, ఎముకలు బలపడతాయి. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఇందుకోసం సొర, బీర, బెండ కూరగాయలతో పాటు, జామ, అవకాడొ, ద్రాక్ష మొదలైన పండ్లు తినాలి.


పర్పుల్‌, నీలం: జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె, రక్తనాళాలు, మూత్రాశయాల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం ద్రాక్ష, చిలగడదుంప, క్యాబేజీ, బీట్‌రూట్‌ తినాలి.


ఎరుపు: గుండె బలపడుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కణ ఉత్పత్తి పెరుగుతుంది. అధిక రక్తపోటు తగ్గడంతో పాటు చర్మపు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం రెడ్‌ క్యాప్సికం, టమాటా, పండు మిరప, చెర్రీ తినాలి.


పసుపు, నారింజ: కీళ్లు, కణజాలాలు, మృదులాస్థి మెరుగుపడతాయి. చర్మపు కొల్లాజెన్‌ వృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఎల్లో క్యాప్సికం, ఆరెంజ్‌, ఎల్లో జుకినీ, అరటి, దోసపండు తినాలి. 


తెలుపు, గోధుమ రంగు: పెద్దపేగులు, పొట్ట ఆరోగ్యం మెరుగవుతుంది. అల్సర్లు తగ్గుతాయి. అసిడిటీ అదుపులోకొస్తుంది. ఇందుకోసం వెల్లుల్లి, ఉల్లి, బంగాళాదుంపలు, చామ దుంపలు తినాలి.

Updated Date - 2022-05-24T18:35:00+05:30 IST