మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ABN , First Publish Date - 2021-04-23T05:24:53+05:30 IST

మునిసిపాలిటీలోని వివిధ వార్డుల్లో చేపట్టనున్న ఎనిమిది అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ గురువారం శంకుస్థాపన చేశారు.

మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
రోడ్ల అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌


నర్సీపట్నం, ఏప్రిల్‌ 22 : మునిసిపాలిటీలోని వివిధ వార్డుల్లో చేపట్టనున్న ఎనిమిది అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ గురువారం శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20వ వార్డులో సీసీ రోడ్డు, 28వ వార్డులో రెండు రోడ్లు, 15వ వార్డులో రెండు రోడ్లు, 12వ వార్డులో రెండు రోడ్లు, 13వ వార్డులో  సీసీ రోడ్లు అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి, కమిషనర్‌ కనకారావు, గుడబండి నాగేశ్వరరావుతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:24:53+05:30 IST