పైప్లైన్ పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2020-09-22T06:43:36+05:30 IST
మేడ్చల్ మున్సిపల్ 6, 7, 17, 18వ వార్డులకు సంబంధించి డ్రైనేజీ, వాటర్ పైపులైన్ పనులను సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి
మేడ్చల్: మేడ్చల్ మున్సిపల్ 6, 7, 17, 18వ వార్డులకు సంబంధించి డ్రైనేజీ, వాటర్ పైపులైన్ పనులను సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.25లక్షలతో పనులు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాలకుర్తి భవానీరాఘవేందర్గౌడ్, మణికంఠ, సాయికుమార్, టీఆర్ఎస్ నాయకులు మర్రి నర్సింహారెడ్డి, సందీప్గౌడ్, లాయక్అలీ, పంజాగారి హరికృష్ణ, రమేష్గౌడ్, కంకాల నర్సింగ్, నాని తదితరులు పాల్గొన్నారు.