అలా పరిగెత్తినంతకాలం ధోనీ ఆడుతూనే ఉంటాడట: మంజ్రేకర్

ABN , First Publish Date - 2020-08-09T02:11:07+05:30 IST

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ధోనీ వయసు 39 ఏళ్లు. ఈ నేపథ్యంలో...

అలా పరిగెత్తినంతకాలం ధోనీ ఆడుతూనే ఉంటాడట: మంజ్రేకర్

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ధోనీ వయసు 39 ఏళ్లు. ఈ నేపథ్యంలో ధోనీ కెరీర్ అయిపోయిందని, చివరి మ్యాచ్ కూడా ఆడేశాడని కొందరు మాజీ ఆటగాళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే వీటన్నింటినీ ఏమాత్రం ధోనీ పట్టించుకోవడం లేదు. ఎలాగైనా మళ్లీ జట్టులోకి రావాలని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ధోనీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘విరాట్ కోహ్లీ వివాహ సమయంలో ధోనీతో నేను మాట్లాడాను. అనుకోకుండా అతడి ఆటగురించి ప్రస్తావన వచ్చింది. జట్టులో అందరికంటే వేగంగా పరిగెత్తే ఆటగాడిని ఓడించగలిగినంతకాలం తాను ఫిట్‌గా ఉన్నట్లే భావిస్తానని ధోనీ అన్నాడు. అలా పరిగెత్తలేనప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపాడ’ని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్-2020లో ధోనీ బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2020-08-09T02:11:07+05:30 IST