రుణాలు సకాలంలో చెల్లించాలి
ABN , First Publish Date - 2021-02-28T05:15:09+05:30 IST
రుణాలు సకాలంలో చెల్లించాలి
మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్
భూపాలపల్లిటౌన్, ఫిబ్రవరి 27: తీసుకున్న సబ్సిడీ రుణాలను సకాలంలో చెల్లించాలని మునిసిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో శనివారం రుణమేళా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కమిషనర్ శ్రీనివాస్, ఎల్డీఎం శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. వీధి వ్యాపారులు పొందిన రుణాలను సకాలంలో డిజిటల్ పే ద్వారా చెల్లించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. యూనియన్ బ్యాంకులో రుణాలకు దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారులు 122 మందికి ఈ కార్యక్రమం ద్వారా రుణాలను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజర్ కుమారస్వామి, యూనియన్ బ్యాంకు మేనేజర్ నిశాంత్కుమార్, ఫీల్డ్ అధికారి కిషోర్, సీహెచ్వో రాజయ్య, మెప్మా ఎంసీ వేములవాడ రాజేశ్వరి, సీవో నిర్మల తదితరులు పాల్గొన్నారు.