అంజన్నను దర్శించుకున్న విద్యాశాఖ కమిషనర్
ABN , First Publish Date - 2021-07-30T05:47:29+05:30 IST
కొండగట్టు ఆంజనేయస్వామిని రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా కమిష నర్ నవీన్మిట్టల్ సతీసమేతంగా గురువారం దర్శించుకున్నారు.
మల్యాల, జూలై 29: కొండగట్టు ఆంజనేయస్వామిని రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా కమిష నర్ నవీన్మిట్టల్ సతీసమేతంగా గురువారం దర్శించుకున్నారు. కొండపైకి చేరుకున్న వారికి కలెక్టర్ జి. రవి పుష్పగుచ్చాలు అందించగా ఆలయంలో అధికారులు, అర్చకులు పూర్ణకుంబ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకపూజలు చేయగా మిట్టల్ దంపతులు ముడుపుకట్టారు. అనంతరం ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు. అర్చకులు శ్రీస్వా మి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వారి వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.