TS News: లోన్ యాప్ ఆగడాలకు మరో యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-20T21:50:33+05:30 IST
మంచిర్యాల: లోన్యాప్ వేధింపులకు మరొకరు ప్రాణాలు తీసుకున్నారు. లోన్ యాప్ నిర్వాహకులు రుణ గ్రహీత రాజేంద్రప్రసాద్(35) ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆయన
మంచిర్యాల: లోన్యాప్ (Loan App) వేధింపులకు మరొకరు ప్రాణాలు తీసుకున్నారు. లోన్ యాప్ నిర్వాహకులు రుణ గ్రహీత రాజేంద్రప్రసాద్(35) ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆయన బంధువులకు పంపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రాజేంద్రప్రసాద్ పురుగు మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. దండేపల్లి మండలం మామిడిపల్లిలో ఈ ఘటన జరిగింది. లోన్యాప్ నిర్వాహకులపై మృతుడి బంధువులు మండిపడుతున్నారు.