సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక
ABN , First Publish Date - 2022-02-10T01:14:23+05:30 IST
సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక
అమరావతి: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.40, గరిష్ఠ ధర రూ.150గా ఉండాలని ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. ఎయిర్కూల్ థియేటర్లకు కనీస ధర రూ.40, గరిష్ఠ ధర రూ.120గా ఉండాలని కమిటీ సూచన చేసింది. నాన్ ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.30, గరిష్ఠ ధర రూ.70గా ఉండాలని కమిటీ తెలిపింది. కమిటీ నివేదికపై గురువారం రోజు సినీ ప్రముఖులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ ధరలపై గురువారం హైకోర్టు డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే మూడుసార్లు సమావేశమై టికెట్ ధరలపై కమిటీ చర్చించింది.