గుర్తుండేలా సమాజ సేవ చేయాలి

ABN , First Publish Date - 2021-04-23T05:03:37+05:30 IST

మనిషి ఎంతకాలం బతికాడన్నది ముఖ్యం కాదని, బతికినన్ని రోజులు సమాజానికి గుర్తుండేలా సేవ చేయాలని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, సమధాన్‌ మహరాజ్‌ అన్నారు.

గుర్తుండేలా సమాజ సేవ చేయాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు

ఇచ్చోడరూరల్‌, ఏప్రిల్‌ 22: మనిషి ఎంతకాలం బతికాడన్నది ముఖ్యం కాదని, బతికినన్ని రోజులు సమాజానికి గుర్తుండేలా సేవ చేయాలని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, సమధాన్‌ మహరాజ్‌ అన్నారు. గురువారం మండలంలోని ముఖ్ర(కె) గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడారు. భక్తిమార్గంలో నడవడం ఎంతో ప్రశాంతత దోరుకుతుందన్నారు. సప్తాహ కార్యక్రమాల వల్ల గ్రామాల్లో చెడు వ్యసనాలు దూరమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నరేంద్రమోదీ వికాస్‌ మిషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యకాంత్‌గిత్తే, సర్పంచ్‌ మీనాక్షి, ఎంపీటీసీ సభ్యుడు సుభాష్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:03:37+05:30 IST