Metro:టికెట్ మెషీన్లు పనిచేయకపోవడంతో క్యూలైన్లలో ప్రయాణికులు

ABN , First Publish Date - 2022-05-01T01:35:46+05:30 IST

Metro:టికెట్ మెషీన్లు పనిచేయకపోవడంతో క్యూలైన్లలో ప్రయాణికులు

Metro:టికెట్ మెషీన్లు పనిచేయకపోవడంతో క్యూలైన్లలో ప్రయాణికులు

చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో మెట్రో స్టేషన్లలో టికెట్ వెండింగ్ మెషీన్లు పనిచేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ వెండింగ్ మెషీన్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్ద క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వారాంతాల్లో సోమవారాల్లో చెన్నైలో టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు ప్రయాణికులు క్యూలైన్లలో చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది. దాదాపు అన్ని స్టేషన్లలో మెజారిటీ మెషీన్లు పనిచేయడం లేదు. మెట్రో రైలులో ప్రతిరోజూ సగటున 1.6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. 42 స్టేషన్లు ఉండగా.. వాటిలో ప్రతి స్టేషన్ లో కనీసం రెండు టికెట్ మెషీన్లు ఉన్నాయి.


Updated Date - 2022-05-01T01:35:46+05:30 IST