ఎండీయూ ఆపరేటర్లకు పరిహారం ఇప్పించండి

ABN , First Publish Date - 2021-05-10T05:12:16+05:30 IST

కరోనాతో మృతి చెందిన ఎండీయూ ఆపరేటర్లకు పరి హారం వచ్చేలా చూడాలని శృంగవరపుకోట ఇంటింటికీ రేషన్‌ ఎండీయూ ఆపరేటర్లు డిమాండ్‌ చేశారు.

ఎండీయూ ఆపరేటర్లకు పరిహారం ఇప్పించండి

శృంగవరపుకోట, మే 9: కరోనాతో మృతి చెందిన ఎండీయూ ఆపరేటర్లకు పరి హారం వచ్చేలా చూడాలని శృంగవరపుకోట ఇంటింటికీ రేషన్‌ ఎండీయూ ఆపరేటర్లు డిమాండ్‌ చేశారు. ఈ మం డల పరిధిలోని ఓ ఎండీయూ ఆపరేటర్‌ చనిపోవడంతో ఆది వారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కొవిడ్‌-19 సెకెండ్‌ వేవ్‌ వ్యాప్తి ఎక్కువ ఉన్న సమయంలో ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీకి వెళ్తున్న ఎండీయూ ఆపరేటర్లు కరోనా బారిన పడుతున్నారని పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దార్‌ మూర్తి దృష్టికి తీసుకువచ్చారు. మృతి చెందిన ఆపరేటర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరా రు. అనంతరం ఈ మేరకు వినతిపత్రం అందించారు. కరోనా నుంచి రక్షణ కల్పిం చాలని పేర్కొన్నారు. ఆపరేటర్లు అల్లు కనక, సీ.మహేశ్వరరావు, వెంకట రమేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-10T05:12:16+05:30 IST